భారీగా నష్టపోయిన సూచీలు

byసూర్య | Fri, Jan 14, 2022, 10:20 AM

దేశీ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ‍స్వల్ప కాలిక లాభాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో మెటల్‌, ఐటీ కంపెనీల షేర్ల దన్నుతో నిన్న లాభాలతో ముగిసిన మార్కెట్‌ ఈ రోజు వెంటనే భారీగా పాయింట్లను కోల్పోతూ నష్టాలను చవి చూసింది.ఆ వెంటనే కనిష్ట ధరల దగ్గర మరోసారి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్‌ నెమ్మదిగా కోలుకుంటోంది.ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సన్సెక్స్‌ 61,040 పాయింట్లతో ప్రారంభంమైంది. ఆ వెంటనే వరుసగా పాయింట్లు కోల్పోతూ 60,757 పాయింట్లకు పడిపోయి 400లకు పైగా పాయింట్లు కోల్పోయింది. అక్కడ కొనుగోలు దారుల మద్దతు లభించడంతో క్రమంగా పాయింట్లు పుంజుకుంటూ ఉదయం 9:45 గంటల సమయానికి 166 పాయింట్ల నష్టంతో 61,069 పాయింట్ల దగ్గర ఉంది. ఇక నిఫ్టీలో సైతం ఇదే ట్రెండ్‌ కొనసాగుతోంది. 41 పాయింట్ల నష్టంతో 18,216 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.


Latest News
 

తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM
ఈ నెల 25న తెలంగాణకు రానున్నా హోంమంత్రి అమిత్ షా Tue, Apr 23, 2024, 08:38 PM
కళ్లు చెదిరేలా అక్రమాస్తులు, అన్ని కోట్లా..,,,సబ్‌రిజిస్ట్రార్‌ తస్లీమా నివాసాల్లో ఏసీబీ సోదాలు Tue, Apr 23, 2024, 08:05 PM