byసూర్య | Thu, Jan 13, 2022, 08:55 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 84,280 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,02,801కు చేరింది. కరోనా బారినపడి మరో ఇద్దరు మరణించారు.అదే సమయంలో 582 మంది కరోనా నుంచి కోలుకున్నారు,తెలంగాణలో ఇప్పటి వరకు 6,78,290 మంది కరోనా నుండి కోలుకున్నారు.జీహెచ్ఎంసీలోనే 1,328 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లో 20,462 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.