byసూర్య | Thu, Jan 13, 2022, 08:38 PM
ఫిబ్రవరిలో కేసీఆర్ నివాసం భవన్ వరకు పాదయాత్ర చేపడతానని బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి పాదయాత్ర ద్వారా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ కు నిర్వాసితుల సమస్యలు విన్నవిస్తామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో సీఎంను నిలదీస్తానని అయన తెలిపారు. నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి చేయడం దారుణమని అని రఘునందన్ అన్నారు. ఓట్ల కోసమే దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే రఘునందన్ మండిపడ్డారు.