byసూర్య | Thu, Jan 13, 2022, 04:56 PM
ఫేక్ కాల్ సెంటర్ ముఠాను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అరెస్ట్ చేశారు. ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ముఠా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను క్లోనింగ్ చేస్తోంది. పంజాబ్లోని మొహాలీకి చెందిన ఏడుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన నవీన్ బోటాని కీలక సూత్రధారి. విదేశాల్లో ఉన్న వారికి ఈ ముఠా క్రెడిట్ కార్డులను సరఫరా చేస్తోంది. ఈ ముఠా ఆన్లైన్లో క్రెడిట్ కార్డులను విక్రయిస్తోంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను లక్ష్యంగా చేసుకుని మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. 50 కోట్లకు పైగా మోసం జరిగింది.