బీజేపీ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

byసూర్య | Thu, Jan 13, 2022, 03:55 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి. మా దమ్మేంటో చూపిస్తాం.. అంటూ సవాల్ విసిరారు. రైతుబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని ప్రశ్నించారు.రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కేసీఆర్ ను జైలులో పెడతామంటూ ఏడాది నుంచి మొరుగుతున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే విచారణ చేయండి అని అన్నారు. ఎవరు జైలుకు పోయారో గుర్తు చేసుకోవాలని చెప్పారు.అంతకముందు సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంశంలో సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమన్నారు. బుధవారం (జనవరి12,2022) హైదరాబాద్ లో మురళీధరరావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదని చెప్పారు.


 


 


Latest News
 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Thu, Apr 18, 2024, 11:10 PM
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు Thu, Apr 18, 2024, 10:25 PM
ఫస్ట్ అటెంప్ట్‌లోనే సివిల్స్ థర్డ్ ర్యాంక్.. సత్తా చాటిన తెలంగాణ యువతి Thu, Apr 18, 2024, 09:08 PM
ఆ రోజు ఫ్లైట్‌లో జరిగింది ఇదే.. విమానంలో వాటర్ బాటిళ్లు పంచటంపై మాధవీలత వివరణ Thu, Apr 18, 2024, 09:03 PM
50 బహిరంగ సభలు, 15 రోడ్‌ షోలు.. గేరు మార్చనున్న సీఎం రేవంత్ రెడ్డి Thu, Apr 18, 2024, 08:59 PM