రైతులకు మేలు చేస్తున్న నంబర్ వన్‌ రాష్ట్రం తెలంగాణ

byసూర్య | Thu, Jan 13, 2022, 02:23 PM

దేశంలో రైతులకు మేలు చేస్తున్న నంబర్ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కంటే కేసీఆర్ పాలనలోనే తెలంగాణ రైతులకు న్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం అవగాహన కూడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు వి.గంగాధర్ గౌడ్, ఎల్.రమణ, దండే విఠల్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలో రైతులకు మేలు చేస్తున్న నంబర్ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఎరువుల ధరల పెంపు, ఇతర అంశాలపై ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ఇప్పటికే కేంద్రం రైతుల నడ్డి విరిచిందని, అది చాలదన్నట్టు ఎరువుల ధరలుపెంచి రైతులను మరోసారి ముంచేస్తోందని మండిపడ్డారు. అయితే తెలంగాణ బీజేపీ నేతలు ఎరువుల ధరలు పెంచడాన్ని సమర్ధించేలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, టీడీపీలో ఉన్నపుడు ఆయన కాంగ్రెస్ విధానాలపై పోరాటం చేయలేదా? అని ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎంత మేలు చేసిందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పరిశ్రమలకు కరెంటు సరిగా ఇవ్వడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు ధర్నా చేసిన రేవంత్... పీసీసీ చీఫ్‌ కాగానే ఆ పార్టీని వెనకేసుకురావడం సబబేనా? అని నిలదీశారు. రైతులకు ఎంతో మేలు చేస్తున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు ప్రశంసించకున్నా పర్వాలేదని.. ఆయన్ని తిడితే మాత్రం పాపం తగిలి నాశనమైపోతారని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తామని బండి సంజయ్ అంటున్నారని, కేసీఆర్‌ను టచ్ చేస్తే బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు ఉరికించి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. రైతులకు ఎంతో చేసిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు.


Latest News
 

స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం Fri, Mar 29, 2024, 11:44 AM
ఎమ్మెల్యేను కలిసిన బార్ అసోసియేషన్ అధ్యక్షుడు Fri, Mar 29, 2024, 11:44 AM
దారుణ... కాటేదాన్ లో మహిళ హత్య Fri, Mar 29, 2024, 11:42 AM
హత్యకేసులో నిందితుడి రిమాండ్ Fri, Mar 29, 2024, 11:41 AM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ Fri, Mar 29, 2024, 11:16 AM