byసూర్య | Thu, Jan 13, 2022, 01:59 PM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కరోనా మహమ్మారి పోయి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు.