byసూర్య | Thu, Jan 13, 2022, 01:12 PM
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభించిన శ్రీ బాలాజీ వేంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు గురువారం ప్రత్యేక పూజలు చేస్తున్నారు.కొవిడ్ నిబంధనలను పాటిస్తూ భక్తులు మాస్కులు ధరించి వేకువజామునుండే దర్శనం చేసుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలాజీని దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. స్థానిక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు దంపతులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.