byసూర్య | Thu, Jan 13, 2022, 01:11 PM
రానున్న మూడు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.