byసూర్య | Thu, Jan 13, 2022, 12:53 PM
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం. గౌడవల్లి-గుండ్లపోచంపల్లి రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి 40-45 ఏళ్ల వయస్సు ఉంటుందని, ఎరుపు రంగు టీస్, లేత నీలం రంగు ప్యాంటు ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుల బంధువులు ఎవరైనా ఉంటే సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.