byసూర్య | Wed, Jan 12, 2022, 09:10 PM
సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని మూడో అంతస్తులోని ఆదాయపు పన్ను బ్లాక్లో మంటలు చెలరేగాయి.మంటల కారణంగా దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పారు.ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ఉద్యోగులు తెలిపారు.