మా పథకాలు మీ రాష్ట్రాల్లో ఉన్నాయా

byసూర్య | Wed, Jan 12, 2022, 08:03 PM

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అంటూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు ఉందా అని నిలదీశారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.. వేల్పూర్ మండల కేంద్రంలో రైతు బంధు సంబరాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. వెర్రిలేసిన కుక్కల్లాగా అర్వింద్, సంజయ్ మొరుగుతున్నారని వేముల ఫైర్ అయ్యారు. రేవంత్ ఓ బుడ్డారఖాన్.. సంజయ్ మెంటల్.. అర్వింద్ ఏమి లేనోడు అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ‘ఇద్దరు అబద్ధాల కోర్లు మొరుగుతున్నారు.. ఒక్కడికి నెత్తి మీద ఉన్నది. లోపల లేదు.. నిజామాబాదోడికి నెత్తి మీద లేదు, లోపల కూడా లేదు..’ అంటూ అర్వింద్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని మాట తప్పిన సిగ్గులేని వాడు మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్‌ను టచ్‌ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తామని వేముల సవాల్ విసిరారు. ‘మధ్యప్రదేశ్ నుంచి ఒక కుక్క వచ్చి కేసీఆర్ మీద మొరిగింది.. అస్సాం నుంచి వచ్చి ఇంకొకడు మొరుగుతున్నాడు.. బీజేపీ పాలిత రాష్టాల నుంచి కూలీలుగా తెలంగాణకు రావడం లేదా? తెలంగాణలో వ్యవసాయ భూములకు భారీగా ధరలుంటే.. ఆంధ్రాలో ధరలే లేవు. ఒకనాడు ఆంధ్రోళ్లు తెలంగాణ భూములు కొనేది. నేడు తెలంగాణ రైతులు ఆంధ్రాలో భూములు కొంటున్నారు.. తెలంగాణ వాళ్లు బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్నారా అనేది బీజేపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు.


Latest News
 

ఆగివున్న బస్సును ఢీకొన్న కారు.. తృటిలో తప్పిన ప్రమాదం Thu, Apr 25, 2024, 01:28 PM
కూలీలకు పనిముట్లు అందించాలి Thu, Apr 25, 2024, 01:26 PM
బూత్ స్థాయిలో కార్యకర్తలు కష్టపడి పని చేయాలి : అరుణతార Thu, Apr 25, 2024, 01:23 PM
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాట్ డెడ్ Thu, Apr 25, 2024, 01:14 PM
అయ్యాపల్లిలో ఘనంగా బోనాలు Thu, Apr 25, 2024, 01:11 PM