byసూర్య | Wed, Jan 12, 2022, 06:05 PM
ప్రస్తుతం హైదరాబాద్ ఐఐటీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలింది. అయితే విద్యార్థుల్లో చిన్నపాటి లక్షణాలున్నాయని కాలేజీ యాజమాన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐఐటీ హైదరాబాద్ హాస్టల్లో ప్రత్యేక ఐసోలేషన్ యూనిట్ను ఏర్పాటు చేసినట్లు ఐఐటీ యాజమాన్యం వెల్లడించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కళాశాలలు, కార్యాలయాలు, పాఠశాలలు మరియు చివరికి ఆసుపత్రులలోని వైద్యులు కూడా కరోనాతో బాధపడుతున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కరోనా రక్కసి రెక్కలు చాస్తోంది. అయితే, మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను మరింత ఉధృతం చేస్తున్నాయి. అయితే ఒక పక్క కరోనా కేసులు సీరియస్గా నమోదవుతున్నాయి.