byసూర్య | Wed, Jan 12, 2022, 03:16 PM
ఉమ్మడి వరంగల్ జిల్లా: భూపాలపల్లి సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. 14 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్గా తేలిందని అధికారులు తెలిపారు. వీరిలో ఐదుగురు సింగరేణి కార్మికులు, ఇద్దరు రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒక్కరోజే 9 కేసులు నమోదు కావటంతో వ్యాప్తి పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కార్మికులు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు, సింగరేణి అధికారులు సూచించారు.