byసూర్య | Wed, Jan 12, 2022, 12:19 PM
తెలంగాణలోని ఏడు యూనివర్సిటీలు వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి పీజీ చివరి విడత వెబ్ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ నెల 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని టీఎస్ సీపీజీఈటీ-2021 కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ అనంతరం ఓయూతో పాటు ఇతర యూనివర్సిటీ కాలేజీలు, అనుబంధ సంస్థలు, ప్రైవేట్ కాలేజీల్లో 30 వేల పీజీ సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.