byసూర్య | Wed, Jan 12, 2022, 11:56 AM
చిరస్మరణీయులు గుర్తుచేసుకోవడం వారిని గౌరవించడం, టాలెంట్ ఉన్న వారిని అభినందించి ప్రోత్సహించడం లాంటివి చేయుటంలో కెసిఆర్ తనయుడు ఐన కేటీర్ గారు ఎప్పుడు ఒక అడుగు ముందు ఉంటారు అని చెప్పక తప్పదు. తాజాగా ఒక కవిని గుర్తుచేసుకుంటూ ఆయన మాటలను తెలియచేస్తూ సోషల్ మీడియా ద్వారా
"కవి, చిత్రకారుడు, ఫోటోగ్రాఫర్ గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి, వర్థంతి ఒకటే రోజు కావడం యాదృచ్చికమే అయినా... "మరణం నా చివరి చరణం కాదు" అని ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతీ లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి" అని తన భావోద్హేకాలను పంచుకున్నారు.