byసూర్య | Wed, Jan 12, 2022, 11:56 AM
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తున్న 317 జీవోను తప్పకుండా సవరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 317 జీవోకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం 317 జీఓ పేరుతో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్న భార్యాభర్తలను విడదీసి స్థానికులను స్థానికేతరులను చేసి సీనియారిటీ, జూనియర్ అనే తేడాను తీసుకొచ్చిందన్నారు. ఉపాధ్యాయుల మధ్య అంతర్గత విభేదాలు.