byసూర్య | Wed, Jan 12, 2022, 10:23 AM
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను నేడు శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరికెపూడి గాంధీ ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పరిధిలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.