byసూర్య | Wed, Jan 12, 2022, 10:19 AM
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అకాలవర్షాలు ముంచెత్తాయి. కరీంనగర్ , సిరిసిల తడిసిముద్దయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు జోరుగా కురిశాయి. అనుకోని వర్షంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి కరీంనగర్ లో రాములోరి భారీ లుమినార్ కుప్పకూలింది. మరో రెండురోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది.