byసూర్య | Tue, Jan 11, 2022, 11:11 PM
దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళా ప్రయాణికుల నుంచి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మంగళవారం నాడు 1.48 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ రూ.72.80 లక్షలు.మూడు వేర్వేరు కేసుల్లో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. వేర్వేరు విమానాల్లో వచ్చిన మహిళలపై కస్టమ్ అధికారులు బంగారం స్మగ్లింగ్పై మూడు కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని వారు తెలిపారు.