byసూర్య | Tue, Jan 11, 2022, 10:08 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 83,153 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,920 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,97,775కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,045కు చేరింది. అయితే 417 మంది కరోనా నుంచి కోలుకున్నారు.