byసూర్య | Tue, Jan 11, 2022, 03:37 PM
తెలంగాణ మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమైంది. వనంలో దేవతలు గుంపులుగా వచ్చి నీరాజనాలు అందుకునే శుభముహూర్తం ఆసన్నమైంది. ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జాతర జరగనుండగా.. జాతరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.హైదరాబాద్ నుంచి మేడారం వరకు ఫిబ్రవరి 16 నుంచి ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులోకి వస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు.