రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ : బోయినపల్లి వినోద్ కుమార్

byసూర్య | Tue, Jan 11, 2022, 02:36 PM

రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ నేతలు తెలంగాణపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజ మెత్తారు.తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత కరెంటు, వికలాంగ పింఛన్లు ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు.


ఓర్వలేక, అభివృద్ధిని అడ్డుకోవడం కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సీఎంలు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, తదితర పథకాలు మీ రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిపై నీతి ఆయోగ్ భేష్ అని ప్రకటించిందని వెల్లడించారు. బీజేపీ సీఎంలు తెలంగాణకు టూరిస్టుల్లాగా వచ్చి విమర్శ చేయడం తగదన్నారు.


 


 


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM