byసూర్య | Thu, Nov 25, 2021, 12:52 PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా నిర్దారణ అయింది. రెగ్యులర్ మెడికల్ చెకప్లో భాగంగా బుధవారం రాత్రి కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా నిర్దారణ అనంతరం పోచారం మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఆరోగ్యాంగా ఉన్నానని ఎవరు బయపడొద్దని తెలిపారు.కాగా నవంబర్ 21న పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలు వివాహం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరుకాగా వారి పక్కనే కూర్చుని మాట్లాడారు స్పీకర్. సీఎంలతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు ఈ పెళ్లికి హాజరయ్యారు. తనకు పాజిటివ్ రావడంతో అందరూ టెస్ట్ చేసుకోవాలని, ఐసోలేషన్లో ఉండాలని స్పీకర్ పోచారం కోరారు.