స్వామివారి సేవలో టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌

byసూర్య | Thu, Nov 25, 2021, 12:06 PM

టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్టీసీ నష్టాల్లో నడుస్తున్నదని లాభాల బాట పట్టేలా చేయాలని స్వామివారిని ప్రార్ధించానన్నారు. టీఎస్ఆర్టీసీ ప్రయాణం సురక్షితమని తెలిపారు. కరోనా వల్ల తక్కువ సర్వీసులు నడుపుతున్నామని.. త్వరలో తిరుపతికి అత్యధిక సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


 


 


Latest News
 

కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్ల గురుకుల విద్యార్థి మృతి : మాజీ మంత్రి హ‌రీశ్‌రావు Wed, Apr 17, 2024, 11:39 PM
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బీభత్సం,,,6 నిమిషాల్లో 6 యాక్సిడెంట్లు Wed, Apr 17, 2024, 09:19 PM
నిప్పుల గుండంలా తెలంగాణ.. వడదెబ్బతో ఇద్దరు మృతి, నేడు మరింత ఎండలు Wed, Apr 17, 2024, 09:14 PM
తెలంగాణ వైపు 70 ఏనుగుల గుంపు.. ఆ ప్రాంతవాసుల్లో టెన్షన్ టెన్షన్..! Wed, Apr 17, 2024, 09:07 PM
అమ్మబాబోయ్.. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే Wed, Apr 17, 2024, 09:03 PM