byసూర్య | Thu, Nov 25, 2021, 10:43 AM
పారిశ్రామిక రంగం వైపు మహిళలను ప్రోత్సహించే లక్ష్యంతో "ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు.మంచి స్పందన లభించింది. F.T.C.C.I కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి "ఎలికో లిమిటెడ్" వైస్ ఛైర్ పర్సన్. వనితా దాట్ల, "సువేన్ ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్" ఛైర్మన్.వెంకట్ జాస్తీ, "గ్లోబల్ ఇన్ఫోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్" M.D.పూర్ణచంద్రరావు, "నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మైక్రో", "స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్".గ్లోరీ స్వరూప.ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సులో మహిళలకు వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలు, అంకుర సంస్థలు ప్రారంభించేప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు సహా...వ్యాపారవేత్తలుగా మారేందుకు కావాల్సిన అనేక అంశాలపై చర్చించనున్నారు.