byసూర్య | Wed, Nov 24, 2021, 01:43 PM
టీఆర్ఎస్ , భాజపా రాజకీయ చదరంగంలో రైతు పావుగా మారాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగ లేఖ విడుదల చేసిన రేవంత్ రెడ్డి.. కల్లాల్లో రైతులు కన్నీరు పెడుతున్నారని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం దిల్లీలో సేద తీరుతున్నారని విమర్శించారు. కెసిఆర్ దిల్లీ పర్యటన. తెరాస, భాజపా ఫిక్సింగ్ లో భాగమని ఆరోపించిన రేవంత్ రెడ్డి.యాత్రలతో రాష్ట్రానికి, రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు. వానాకాలం పంట కొనకుండా యాసంగి పంచాయితీ ఏంటిని ప్రశ్నించారు. రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.