byసూర్య | Tue, Nov 23, 2021, 02:08 PM
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సంవత్సరానికి ఎంత ధాన్యం?..ఏ రూపంలో కొనుగోలు చేస్తారో? తేల్చాలని బృందం సభ్యులు కేంద్రాన్ని కోరనున్నారు. సమావేశానికి మంత్రి కేటీఆర్ వెంట టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు వెళ్లనున్నారు