byసూర్య | Tue, Nov 23, 2021, 11:48 AM
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులకు ఇబ్బందులు తప్పట్లేదు. వర్షానికి పంట పూర్తిగా తడిసిపోయి మెులకలు రావటంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురులోని వ్యవసాయ మార్కెట్ లో.రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దయ్యింది. పంట తీసుకువచ్చి నెల గడుస్తున్నా. కొనుగోలు చేపట్టలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పంట ఎందుకు పనికిరాకుండా పోయిందని వాపోయారు.