byసూర్య | Tue, Nov 23, 2021, 10:44 AM
బిజినేపల్లి మండలంలో గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన పిట్టల కుర్మయ్య (30) ఈ నెల 20న గంగారంలో బొడ్రాయి ఉత్సవాల నేపథ్యంలో బంధువుల ఇంటికి వచ్చాడు. తినేటప్పుడు అతని గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయింది. నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.