byసూర్య | Tue, Nov 23, 2021, 08:43 AM
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్ల గడువును మరోసారి పొడిగించారు. ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 30వ తేదీ వరకు ఇంటర్మీడియట్ల గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గడువు పొడిగింపు ఇంతటితో ముగిసిందని స్పష్టం చేసింది. ఆయా కాలేజీలు, యూనియన్ల అభ్యర్థన మేరకు మరోసారి గడువును పొడిగించినట్లు ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.