byసూర్య | Mon, Nov 22, 2021, 10:44 PM
తెలంగాణలో గత కొన్నిరోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పటింది . గత 24 గంటల్లో 31,514 కరోనా పరీక్షలు చేయగా , 137 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 54 కొత్త కేసులు నమోదు అయ్యాయి, కరీంనగర్ జిల్లాలో 15 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వచ్చాయి. అయితే 172 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు.