byసూర్య | Mon, Nov 22, 2021, 12:15 PM
తండ్రి మందలించాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం. మేకల సోంపల్లి గ్రామానికి చెందిన కురువ ఆంజనేయులు(20) అనే యువకుడు తండ్రి దుబ్బన్న మందలించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు కొత్త మోటార్ సైకిల్ తెచ్చుకున్నారు. మోటార్ సైకిళ్లకు సంబంధించి నెలవారీ వాయిదాలు కట్టాలని కుమారుడిని మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అతని తండ్రి దుబ్బన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.