byసూర్య | Mon, Nov 22, 2021, 09:14 AM
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితులు శరత్ (21), రాహుల్ (19) రాత్రి తాడ్ బంద్ నుంచి ద్విచక్రవాహనంపై బోయిన్ పల్లి చౌరస్తా వైపు వస్తున్నారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ మూలలో వీరి వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని రోడ్డుపై నుంచి కుడివైపుకు దూసుకెళ్లింది. అదే సమయంలో తద్బంద్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రగాయాలతో మృతి చెందారు. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.