byసూర్య | Mon, Nov 22, 2021, 08:43 AM
హైదరాబాద్లోని ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో విషాదం నెలకొంది. కారు కిందపడి పడి ఏడాదిన్నరేళ్ల బాలుడు మృతి చెందాడు. తండ్రి నడుపుతున్న కారు చక్రాల కింద పడి బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. అపార్ట్మెంట్లో లక్ష్మణ్ అనే వ్యక్తి వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారును కడిగి అపార్ట్ మెంట్ లో ఉంచుతుండగా ఒక్కసారిగా కారు ముందు భాగంలోకి వచ్చాడు. గాయాలతో బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి నడుపుతున్న కారుకింద బాలుడు మృతి చెందడం స్థానికంగా విషాదం కాగా తల్లిదండ్రుల రోదన అందరినీ కలచివేసింది.