byసూర్య | Mon, Nov 22, 2021, 08:25 AM
రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్కులో చిక్కుకున్న క్లీనర్కు తీవ్ర గాయాలు కాగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ట్రక్కు శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.