byసూర్య | Mon, Nov 22, 2021, 08:10 AM
గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్.. పంజాబ్లో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామంటే ఎలా నమ్ముతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవడం లేదని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్లో వరద సాయం అందించలేదని రేవంత్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు ఇస్తానంటే ఎలా నమ్ముతారని రేవంత్ ప్రశ్నించారు.