ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదు : రేవంత్‌రెడ్డి

byసూర్య | Mon, Nov 22, 2021, 08:10 AM

గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని సీఎం కేసీఆర్.. పంజాబ్‌లో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తామంటే ఎలా నమ్ముతారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 7,500 మంది రైతులు చనిపోయారని, వారి కుటుంబాలను ఆదుకోవడం లేదని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వరద సాయం అందించలేదని రేవంత్ ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో పంజాబ్‌లో మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు ఇస్తానంటే ఎలా నమ్ముతారని రేవంత్ ప్రశ్నించారు.


Latest News
 

కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM
ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలి Fri, Mar 29, 2024, 02:50 PM
దేవునిపల్లిలో ఒకరి అదృశ్యం Fri, Mar 29, 2024, 02:47 PM
వన్ కార్డ్ బిజినెస్ సొల్యూషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ Fri, Mar 29, 2024, 02:45 PM
భారీ గజమాలతో బిజెపి నాయకులను సత్కరించిన కార్యకర్తలు Fri, Mar 29, 2024, 02:44 PM