ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌

byసూర్య | Mon, Nov 22, 2021, 08:04 AM

సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. 3. 4 రోజులు హస్తినలో ఉంటారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. వరి సేకరణతో పాటు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కూడా సీఎం వివరణ కోరనున్నారు. వరి ధాన్యం ఎంత కొనుగోలు చేయాలనేది వార్షిక లక్ష్యమైతే. రాష్ట్ర రైతులకు దిశానిర్దేశం చేసేందుకు ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటోంది. ఢిల్లీ పర్యటనపై కేంద్రం స్పందిస్తూ యాసంగి పంటలపై స్పష్టమైన ప్రకటన చేయనుంది. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలన్నారు. కృష్ణా ట్రిబ్యునల్‌ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. గిరిజనుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినా కేంద్రం తేల్చలేదు. ఎస్సీ వర్గీకరణపై కూడా తేల్చాలని కోరనున్నారు. బీసీ జనాభా లెక్కలపైనా చర్చించే అవకాశం ఉంది. సీఎం వెంట మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు ఉన్నారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM