byసూర్య | Sun, Nov 21, 2021, 11:27 AM
పెరుగును ప్రతి రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవిలో మన శరీరానికి పెరుగు చల్లదనాన్నిస్తుంది. పెరుగును తింటే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పలు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
- పెరుగును తింటే జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. కడుపులో మంట తగ్గుతుంది.
- అధిక బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.
- పెరుగు తినడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.
- క్యాన్సర్ను అడ్డుకునే శక్తి పెరుగులోని ఔషధ గుణాలకు ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
- పెరుగును ప్రతి రోజు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.