byసూర్య | Sun, Nov 21, 2021, 09:31 AM
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 32,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 134 పాజిటివ్గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. జనగామ, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 164 మంది కరోనా నుండి కోలుకున్నారు, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,452 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,66,846 మంది కోలుకున్నారు. మరో 3,626 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 3,980కి చేరింది.