byసూర్య | Sun, Nov 21, 2021, 08:32 AM
తెలంగాణ సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై ఎన్నిసార్లు అడిగినా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్తున్నామని కేసీఆర్ చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కానున్నారు.