byసూర్య | Sun, Nov 21, 2021, 12:12 AM
కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు-2021లో దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ స్వయం సుస్థిర నగరంగా సిద్ధిపేట మున్సిపాలిటీని గెలుచుకుంది.మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ కె మంజుల, కమిషనర్ కెవి రమణాచారి అవార్డును అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోనే ఉత్తమ నగరంగా సిద్దిపేటను తీర్చిదిద్దడంలో సమిష్టి కృషి చేసిన సిద్దిపేట ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. తెలంగాణలోని మిగిలిన పట్టణ సంస్థలకు సిద్దిపేట స్పూర్తిగా నిలిచిందన్నారు.