byసూర్య | Sat, Nov 20, 2021, 09:28 PM
తమిళనాడు వద్ద తీరం దాటిన తర్వాత క్రమంగా బలహీనపడి ఆ తరువాత అల్పపీడనంగా కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది . దీని ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది . అల్పపీడన వల్ల హైదరాబాదులో సాయంత్రం జల్లులు కురిశాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో వాన జల్లులు కురిశాయి. హైదరాబాదుతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.