అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు : రేణుకా చౌదరి

byసూర్య | Sat, Nov 20, 2021, 03:44 PM

అసెంబ్లీలో ఆడపడుచుపై అసత్య ఆరోపణలు సరికావు.  సభలో ప్రతిపక్ష నాయకుడిని అవమానపరచడానికి ఆయన భార్య వ్యక్తిత్వాన్ని చులకన చేసి మాట్లాడడం సభామర్యాద కాదు.అసలు సభలో లేని, సభకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించి వారి పై చవకబారు ఆరోపణలు చేయడం విజ్ఞతకాదు..అధికారం, సభలో మంద బలం ఎప్పుడూ శాశ్వతం కాదు. కేవలం మన హుందాతనం,ప్రవర్తన మాత్రమే  శాశ్వతం.ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాల్సిన శాసనసభ వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు వేదికవ్వటం విచారకరం..ప్రస్తుత రాజకీయాల్లో హుందాతనం లోపిస్తోంది. ప్రజా ప్రతినిధులు బాధ్యత మరచి అసభ్య పదజాలంతో మాట్లాడటం సరైంది కాదు. అధికార, ప్రతిపక్షాలు సంయమనంతో వ్యవహరించాలి. మహిళలు, కుటుంబ సభ్యులపై నిందారోపణలకు స్వస్తి పలకాలి,ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సభ్యులు పనిచేయాలి అని  రేణుకా చౌదరి  తెలిపారు 


 


 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM