byసూర్య | Sat, Nov 20, 2021, 08:08 AM
మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు మున్సిపాలిటీలో లారీ చక్రాల కింద పడి ఇద్దరు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఐఓసీ ఇండియన్ ఆయిల్ పంప్ సమీపంలో అన్నా చెల్లెలు ద్విచక్ర వాహనం లారీని ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మరికల్ మండలం కొండారెడ్డి పల్లికి చెందిన చంద్రశేఖర్, మమతగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.