byసూర్య | Fri, Nov 19, 2021, 09:29 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు చేయగా, 137 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 కొత్త కేసులు వచ్చాయి . రంగారెడ్డి జిల్లాలో 16, కరీంనగర్ జిల్లాలో 11, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 10 కేసులు వచ్చాయి . వికారాబాద్, నిర్మల్, ములుగు, మెదక్, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జనగామ జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు అవలేదు అయితే 173 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు చనిపోయారు.