byసూర్య | Fri, Nov 19, 2021, 12:19 PM
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక పున్నమి శోభతో శివాలయాలు కళకళలాడుతున్నాయి .శుక్ర వరం తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామస్వరంతో ఆలయాలన్నీ మార్మోగాయి. వేములవాడ, కాళేశ్వరం, వేయిస్తంభాల గుడి, రామప్ప,శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, వేములవాడ, ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నదుల్లో పుణ్యస్నాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు.