byసూర్య | Fri, Nov 19, 2021, 10:44 AM
నేడు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే యాదాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సత్యనారాయణ స్వామి వ్రత పూజలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొండపై వాహనాలను నిలిపివేశారు.