byసూర్య | Fri, Nov 19, 2021, 09:46 AM
వివాహిత ఆత్మహత్య ఉద్రిక్తతకు దారి తీసింది. మృతురాలి బంధువులు, గిరిజన సంఘాలు భర్తపై ఆందోళన చేయడంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎల్బీనగర్కు చెందిన అమూల్యశ్రీ గురువారం ఉరివేసుకుంది. ఆమె ఆత్మహత్యకు భర్త డేవిడ్ కారణమని, నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.