byసూర్య | Fri, Nov 19, 2021, 08:24 AM
మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీలోని రాయపాటి నరేష్ ఇంట్లో చోరీకి పాల్పడాడు నిందితుడు నీలాల అవినాష్. నిందితుడుని పోలీసులు తాజా అరెస్టు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగులగొట్టిన నిందితులు మరో ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ టీవీ, రెండు ల్యాప్టాప్లు, హోండా స్కూటీని అపహరించారు. నిందితుడి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలు ఒకరోజు కంటే ఎక్కువ రోజులు ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు.